ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
Wed Jun 04, 2025 10:08 Politics
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వేగవంతం చేసింది. మొత్తం 4,755 మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించారు. 4,693 మంది స్కూల్ అసిస్టెంట్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేశారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులతో పాటుగా ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తి చేశారు.. స్కూల్ అసిస్టెంట్ల బదిలీల తుది జాబితా కూడీ రెడీ అయ్యింది. ప్రభుత్వం ఈ నెల 10 నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. గతంలో జీవో-117 వల్ల చాలా సమస్యలు రాగా.. కూటమి ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీల చట్టం ప్రకారం తొలిసారి ఈ బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో చేరేలా ప్లాన్ చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ముందు రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తైన తర్వాత డీఎస్సీ-2008, 1998 బ్యాచ్ల వారికి బదిలీలు చేపడతారు. వీరికి వారి జిల్లాల్లోనే బదిలీలు ఉంటాయంటున్నారు. అనంతరం కొత్తగా డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్లు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2గా 1,373 మందికి ప్రమోషన్లు దక్కాయి. మే 31న రిటైరైన ప్రధానోపాధ్యాయుల స్థానాలను కూడా ప్రమోషన్లతో భర్తీ చేశారు. ఎస్జీటీలకు కూడా ప్రమోషన్లు దక్కనున్నాయి. మోడల్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులుగా 1,382 మందికి అవకాశం రాగా.. స్కూల్ అసిస్టెంట్లుగా 2,000 మందికి అవకాశం దక్కుతుంది.
ప్రధానోపాధ్యాయుల బదిలీలకు 2,058 దరఖాస్తులు వచ్చాయి.. వీరిలో 1,494 మంది మాత్రమే బదిలీ అయ్యారు.. ఆ వెంటనే కొత్త స్కూళ్లలో చేరిపోయారు. ప్రాథమిక పాఠశాలల విషయానికి వస్తే.. ఆ స్కూల్స్లో ప్రధానోపాధ్యాయులు 3,532 మందిలో 2,037 మంది బదిలీలకు కోసం దరఖాస్తు చేసుకోగా.. 1,872 మంది బదిలీలు మీద కొత్త స్కూళ్లలో చేరారు. 42,248 మంది ఎస్జీటీలు బదిలీల కోసం అప్లై చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9,607 మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్లలో 4,693 మందిని ప్రధాన ఉపాధ్యాయులుగా సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే ఎస్ఏల బదిలీలకు 43,033 మంది దరఖాస్తు చేసుకోగా.. 23,113 మంది తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. మిగిలిన వారు రిక్వెస్ట్ మేరకు బదిలీల కింద దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు డీఎస్సీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.. పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ప్రక్రియ తర్వాత ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేర్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్లోనే, భూసేకరణకు రెడీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!
పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!
కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
జూన్లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్కు అప్గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #APGovernment #GovernmentEmployees #PromotionsInAP #TransfersIssued #EmployeeWelfare
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.